బోయినిపల్లి మండలంలో అక్రమ మట్టి తరలింపు ఆపాలి.

రాజన్న సిరిసిల్ల జిల్లా :గత కొన్ని రోజులుగా బోయిన్పల్లి మండల కేంద్రం కు సమీపాన స్తంభం పెళ్లి దగ్గర నుండి అక్రమ మట్టి తరలింపు లారీల ద్వారా పర్మిషన్ లేకుండా పాలకులు అండదండలతో లారీల ద్వారా ఇటుక బట్టీలకు తరలించకపోవడం జరుగుతుందని, దీనివల్ల పెద్ద ఎత్తున ప్రభుత్వానికి కోట్ల రూపాయలలో ఆదాయానికి గండి కొడుతూ ప్రకృతి జాతి సంపాదన కొల్లగొడుతున్నారని బోయిన్పల్లి సిపిఎం పార్టీ మండల కన్వీనర్ గురజాల శ్రీధర్( Convener Gurjala Sridhar ) అన్నారు.

మండల మట్టి మాఫియా, ఈ బోయిన్పల్లి మండల కేంద్రంలో ఏదో ఒక గ్రామాన్ని ఎంచుకొని ఆ గ్రామంలో ఉన్న చెరువుల నుంచి మట్టిని పెద్ద ఎత్తున అనాధికార పర్మిషన్ల పేరిట లారీల ద్వారా తరలించకపోతున్నారు.

నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం, చొప్పదండి ఎమ్మెల్యే ఈ మండలం మీద దృష్టి పెట్టి మట్టి అవినీతికి అడ్డుకట్ట వేయాలని ఈ సందర్భంగా ప్రజల పక్షాన, రైతుల పక్షాన ఈ ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గురిజాల శ్రీధర్, నాయకులు రామంచ అశోక్ పాల్గొన్నారు.

రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి

Latest Rajanna Sircilla News