ముఖ్యంగా చెప్పాలంటే ప్రస్తుత కాలంలో చాలా మంది ప్రజలు ఆరోగ్యం పై ఎక్కువగా శ్రద్ధ చూపిస్తున్నారు.ఎందుకంటే ప్రస్తుత సమాజంలో ఎన్నో రకాల కొత్త కొత్త అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి.
ఈ అనారోగ్య సమస్యల నుంచి మనం బయట పడాలంటే ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకోవడం ఎంతో మంచిది.ముఖ్యంగా చెప్పాలంటే ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలలో చేపలు ఎంతో ముఖ్యమైనవి.
చేపల వల్ల మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.వైద్యులు కూడా చేపలను తినమని చెబుతూ ఉంటారు.
చేపలు తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.ఆ ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా చెప్పాలంటే సాల్మన్ చేపల్లో( Salmon Fish ) ఒమేగా 3 ఫాటీ ఆసిడ్స్, విటమిన్ డి ఎక్కువగా ఉంటాయి.వీటిని తినడం వల్ల గుండె ఆరోగ్యాంగా ఉంటుంది.ఇంకా చెప్పాలంటే సహజసిద్ధంగా సముద్రాలలో దొరికే సాల్మన్ చేపలు తక్కువ దొరికే లభిస్తాయి.కాబట్టి వీటిని చాలామంది తరచుగా తింటూ ఉంటారు.వైల్డ్ సాల్మన్ చేప కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది.ఇందులో విటమిన్స్, మినరల్స్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.
అలాగే ప్రపంచంలోని అత్యంత ఆరోగ్యకరమైన ఆహారాలలో ఇది కూడా ఒకటి.దీనినే పొలుసుల చేపలు( Flaky fish ) అని కూడా అంటారు.
దీనిలో విటమిన్ బి12, ఒమేగా 3( Omega 3 ) ఫాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉంటాయి.అంతే కాకుండా ఈ చేపను తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల్ని దూరం చేస్తుంది.అథెరోస్క్లోరోసిస్ తో బాధపడే వారికి డయాబెటిస్, హార్ట్ పేషెంట్స్ కి ఈ చేప ఎంతో మంచిది.ఈ చేపలు తినే వారికి గుండె సమస్యలు ( Heart Problems )వచ్చే సమస్య తక్కువగా ఉంటుంది.
హెర్రింగ్ చేపలను రోజు వారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎర్ర రక్తకణాలు ఆరోగ్యంగా ఉంటాయి.అలాగే ఎమకలు కూడా బలంగా ఉంటాయి.అంతే కాకుండా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.