నేను పిలిస్తే 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తారు..: మంత్రి కోమటిరెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్ 14 ఎంపీ సీట్లు గెలవడం ఖాయమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి( Minister Komatireddy Venkat Reddy ) అన్నారు.రెండు లేదా మూడు సీట్లు బీజేపీ గెలుస్తుందని జోస్యం చెప్పారు.

 If I Call 25 Mlas Will Join Congress Minister Komati Reddy Details, 25 Mla’s,-TeluguStop.com

ఇక బీఆర్ఎస్ కు( BRS ) ఒక్క సీట్ కూడా రావడం కష్టమేనని పేర్కొన్నారు.మెదక్ లో బీఆర్ఎస్ మూడో స్థానంలో ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లా సాగునీటి రంగానికి కేసీఆర్ తీరని అన్యాయం చేశారని ఆరోపించారు.ఈ నేపథ్యంలోనే ఏ ముఖం పెట్టుకొని మిర్యాలగూడ నుంచి కేసీఆర్ బస్సు యాత్ర( KCR Bus Yatra ) చేపడుతున్నారని ప్రశ్నించారు.

దేశంలో మత ఘర్షణలు చెలరేగేలా మోదీ మాట్లాడటం బాధాకరమని చెప్పారు.మొదటి దశ ఎన్నికల్లో ఇండియా కూటమికే( INDIA Alliance ) ఎక్కువ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

ఉత్తర భారత్ లో బీజేపీ పరిస్థితి బాగలేదన్న మంత్రి కోమటిరెడ్డి అందుకే దక్షిణ భారత్ పై ఫోకస్ పెట్టారని తెలిపారు.బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారన్న ఆయన తాను పిలిస్తే 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తారని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube