టీడీపీ ఎమ్మెల్యేగా సభలో నేను ఉండడం వైసీపీకి కంటగింపుగా మారింది.నాపై సుధాకర్ బాబు, ఎలీజా దాడి చేశారు.
దొంగే దొంగ అన్నట్టు.నేనే దాడి చేశానంటున్నారు.
దళితుడికే పుట్టావా.? అని గతంలో మంత్రి నాగార్జున అన్నారు.ఎడిట్ చేయకుండా వీడియో ఫుటేజ్ విడుదల చేయాలి.క్షేత్ర స్థాయిలో పట్టు కొల్పోయిన వైసీపీ ఎమ్మెల్యేలు మాపై దాడులు చేస్తున్నారు.బుచ్చయ్య పైనా దాడికి ప్రయత్నించారు.దీనికి తగిన మూల్యం చెల్లించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.
సుధాకర్ బాబు నాపై దాడి చేసినప్పుడు నేను కిందపడిపోయాను.స్పీకరే ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షి.
.నాపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి.అధికారంలో ఉన్నామని.నేనే దాడి చేశారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.ముందస్తు కుట్రలో భాగంగానే ఈ దాడి.ప్రభుత్వం కులాలను రెచ్చగొడుతోంది.
ఎస్సీలే నాపైకి ఎందుకొస్తారు.ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ప్రశ్నించడం వల్లే మాపై దాడులు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమే ఈ దాడికి కారణం.స్పీకర్ రక్షణ కోసం మార్షల్స్ లేరా.? చివరి వరుసలో ఉన్న వైసీపీ ఎస్సీ ఎమ్మెల్యేలు ఎలా వచ్చారు…







