సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఏ విషయమైనా క్షణంలో వైరల్ అవుతుంది.ఈ క్రమంలోని కొందరు సోషల్ మీడియా వేదికగా కొన్నిసార్లు అసత్యపు వార్తలను ప్రచారం చేయడం కొందరికి ఎంతో ఇబ్బంది కలుగుతూ ఉంటుంది.
ముఖ్యంగా సెలబ్రిటీల గురించి ఇలాంటి వార్తలు ఏదో ఒకటి వస్తూ ఉంటాయి.కొన్నిసార్లు బ్రతికున్న నటీనటులను కూడా సోషల్ మీడియాలో చంపేస్తుండడం బాధాకరం.
ఇలా ఫలానా నటీనటులు చనిపోయారంటూ సోషల్ మీడియాలో వార్తలు రావడంతో ఆ వార్తలు చూసినటువంటి నటీనటులు స్పందించి మేము బ్రతికే ఉన్నాం అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇదివరకే ఎంతోమంది నటీనటుల విషయంలో ఇలాగే జరిగింది తాజాగా సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు( Kota Srinivarao ) కూడా చనిపోయారు అంటూ సోషల్ మీడియాలో( Social Medi a) అసత్యపు వార్తలు ప్రచారం చేశారు.దీనితో ఈ వార్తలు పై నటుడు కోట శ్రీనివాసరావు స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన ఒక వీడియోని విడుదల చేస్తూ నేను చనిపోయాను అంటూ వార్తలు రావడం బాధాకరం.
నేను బ్రతికే ఉన్నానని చెప్పారు.తాను ఆరోగ్యంగానే ఉన్నానని ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు.
అయితే తన గురించి సోషల్ మీడియాలో ఇలాంటి అసత్యపు వార్తలు రావడం బాధాకరమని తెలిపారు.
ఉగాది పండుగ( Ugadi ) పనులలో నిమగ్నమైన తనకు వరుసగా ఫోన్ కాల్స్ రావడం తనని ఇబ్బందికి గురిచేసాయని అలాగే నేను చనిపోయాను అంటూ పదిమంది పోలీసులు ఇంటి వద్దకు బందోబస్తుకు రావడం తనని బాధించిందని కోటా శ్రీనివాసరావు తెలిపారు.డబ్బు సంపాదించాలని ప్రతి ఒకరు భావిస్తూ ఉంటారు.అయితే డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి.
ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తూ డబ్బు సంపాదించడం మంచిది కాదంటూ ఈయన హెచ్చరించారు.ప్రజలు ఈ అసత్యపు వార్తలను నమ్మద్దు అంటూ తన గురించి వచ్చినటువంటి వార్తలపై ఖండించారు.