బుల్లితెరపై ప్రస్తుతం తెలుగు లేడీ యాంకర్ల హవా కొనసాగుతోంది.
దాదాపు తొమ్మిది సంవత్సరాల నుంచి బుల్లితెరపై యాంకర్ గా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న అనసూయ ప్రస్తుతం జబర్దస్త్ షోకు యాంకర్ గా కొనసాగుతున్నారు.
అదే సమయంలో బుల్లితెరపై ఆఫర్ల కంటే వెండితెరపై ఆఫర్ల గురించి అనసూయ ఎక్కువగా దృష్టిపెట్టారు.మరోవైపు పలు ఈవెంట్లకు అనసూయ హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్నారు.
అయితే తాజాగా జబర్దస్త్ ప్రోమో రిలీజ్ కాగా ఆ ప్రోమోలో హైపర్ ఆది టీమ్ అనసూయ పరువు పోయేలా స్కిట్ చేశారు.హైపర్ ఆది, రామ్ ప్రసాద్ జబర్దస్త్ టీమ్ లీడర్లకు, యాంకర్లకు, జడ్జీలకు వయస్సు అయిపోతే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ తో స్కిట్ చేశారు.
ముసలోళ్ల గెటప్ లో హైపర్ ఆది, రామ్ ప్రసాద్ ఎంట్రీ ఇవ్వగా హైపర్ ఆది రామ్ ప్రసాద్ నా వేళ్లు చూసావా ఎలా ఉన్నాయో అని అంటాడు.
హైపర్ ఆది అందరికీ గోకిగోకి గోళ్లు అరిగిపోతే నీకు వేళ్లు అరిగిపోయాయంటూ రామ్ ప్రసాద్ పై పంచ్ వేస్తాడు.ఆ లెక్కన చూస్తే నీకు వేళ్లే ఉండకూడదని రామ్ ప్రసాద్ ఆదితో అనగా ఆ లెక్కన సుధీర్ కు ఏం అరిగిపోయి ఉంటాయో అని హైపర్ ఆది పంచ్ వేస్తాడు.ఆ తర్వాత రైజింగ్ రాజు చీర కట్టుకుని వయస్సు మళ్లిన అనసూయలా ఎంట్రీ ఇచ్చారు.
రామ్ ప్రసాద్ అనసూయకు చెవులు వినిపించవని 90వేల రూపాయలు ఇస్తామని చెబితే 65వేల రూపాయలకే చేస్తానని అనసూయ ఒప్పుకున్నారని ఆదికి చెబుతాడు.
ఆ తర్వాత అనసూయ 45 వేల రూపాయలకే చెవులు వినబడకపోవడంతో అంగీకరించినట్టు స్కిట్ లో చూపించారు.ఆ స్కిట్ చూసి షాకవ్వడం అనసూయ వంతైంది.హైపర్ ఆది, రామ్ ప్రసాద్ కలిసి చేసిన స్కిట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002[email protected]Ph No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy