భార్యను వేధించే భర్తలు చాలా మందే ఉంటారు.అదనపు కట్నం కోసం చాలా మంది భార్యలను వేధిస్తారు.
అత్తగారి ఇంటి నుండి ఎన్ని డబ్బులు ఇచ్చినా.మరిన్ని కావాలని రోజూ గొడవ చేస్తారు.
పుట్టింటికి వెళ్లకుండా మహిళలను నిర్బంధిస్తారు.మరికొందరేమో అనుమానంతో మహిళలపై వేధింపులకు దిగుతారు.
ఒక్కొక్కరిది ఒక్కో ధోరణి కానీ మహిళలను వేధించే వారు ఈ కాలంలోనూ చాలా మంది ఉన్నారు.
అలాగే అదనపు కట్నం కోసం భార్యను వేధించడమే కాకుండా ఆమెను పొట్టనపెట్టుకున్న ఓ కిరాతకుడికి కోర్టు శిక్ష విధించింది.
కానీ భార్యను తాను చంపలేదని ఆ వ్యక్తి నెత్తినోరూ కొట్టుకుని మరీ చెప్పాడు.అయినా అతని మాట ఎవరూ వినలేదు.
మానవ మృగానికి తగిన శిక్ష పడిందని అంతా అనుకున్నారు.
ఇక్కడే అసలు ట్విస్టు దాగి ఉంది.
ఏంటంటే.భార్య హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఆ వ్యక్తి పూర్తిగా నిర్దోషి.
అతను ఎలాంటి నేరం చేయలేదు.అదనపు కట్నం కోసం భార్యను చంపలేదని తర్వాత తెలిసింది.
కానీ అప్పటికే 6 నెలలు గడిచింది.ఆ మహిళకు మతిస్తిమితం లేదని తను తప్పిపోయి చాలా కాలం తర్వాత తన తల్లిగారింటికి చేరుకుందని తెలియడంతో అంతా షాక్ కు గురయ్యారు.
ఈ ఘటన పరిగావన్ గ్రామంలో జరిగింది.బాధితుడి పేరును శశి కుమార్ కాగా.అతని భార్య పేరు హీరాదేవి.వారికి ఏడాది వయస్సున్న కుమారుడు ఉన్నాడు.తల్లి మతిస్థిమితం లేక తప్పిపోవడం, తండ్రి హత్య కేసులో జైలుకు వెళ్లడంతో.ఆ ఏడాది చిన్నారి అనాథ అయ్యాడు.
అయితే ఆ పిల్లాడిని బంధువులు చేరదీసినట్లు తెలుస్తోంది.