టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శ్రీదేవి సోడా సెంటర్’పై ఇప్పటికే ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన వైవిధ్యాన్ని చాటుకునేందుకు సుధీర్ బాబు సిద్ధం అవుతున్నాడు.
అయితే ఈ సినిమాను పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా దర్శకుడు కరుణ కుమార్ తీర్చిదిద్దాడు.ఈ సినిమా పూర్తిగా గోదావరి నేపథ్యంలో సాగనుండటంతో ఈ సినిమా ఎలా ఉంటుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.
కాగా ఈ సినిమాలోని హైలైట్ల గురించి చిత్ర యూనిట్ ప్రత్యేకించి చెప్పుకొచ్చింది.ముఖ్యంగా ఈ సినిమాలో గోదావరి నదిపై ఏకంగా 84 బోట్లతో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరించారట చిత్ర యూనిట్.
ఈ యాక్షన్ సీక్వెన్స్ను 15 రోజుల పాటు చిత్రీకరించారట చిత్ర యూనిట్.ఈ సినిమాకే హైలైట్గా నిలవనున్న ఈ యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులను ఖచ్చితంగా థ్రిల్ చేస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
ఇక సుధీర్ బాబు ఈ సినిమాలో లైటింగ్ సూరిబాబు అనే పాత్రలో నటిస్తుండగా, ఆయన పాత్ర చాలా మాసీగా ఉండనుందట.ఈ పాత్రలో సుధీర్ బాబు పర్ఫార్మెన్స్ పీక్స్లో ఉండనుందట.
ఇక ఈ సినిమాలో హీరోయిన్గా ఆనంది నటస్తోంది.పలాస 1978 ఫేం కరుణ కుమార్ తనదైన మార్క్తో తెరకెక్కిస్తున్నాడు.
ఇక ఈ సినిమాను 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై విజయ్ చిల్లా, శశిదేవిరెడ్డి నిర్మిస్తున్నారు.ఈ సినిమాను ఆగస్టు 27న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
కాగా ఈ సినిమా పోస్టర్స్, టీజర్లు, సాంగ్స్ ఇప్పటికే ఈ సినిమాపై పాజిటివ్ బజ్ను క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాయి.మరి ఈ సినిమాతో సుధీర్ బాబు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.