భారతదేశపు అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( SBI ), ప్రవాస భారతీయుల ( NRIs ) కోసం వారి స్మార్ట్ఫోన్లను ఉపయోగించి ఆన్లైన్లో సేవింగ్, కరెంట్ ఖాతాలను తెరవడానికి అనుమతించే కొత్త సేవను ప్రారంభించింది.భారతదేశం వెలుపల నివసించే కొత్త ఎస్బీఐ కస్టమర్లకు ఈ సేవ అందుబాటులో ఉంది.
ఇది ఎన్నారైలకు వ్యక్తిగతంగా బ్రాంచ్ను సందర్శించాల్సిన అవసరం లేకుండా భారతదేశంలో వారి ఖాతాలను తెరవడం, మేనేజ్ చేయడాన్ని సులభం చేస్తుంది.
ఖాతాను తెరవడానికి, ఎన్నారైలు ఎస్బీఐ యోనో యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి.NRE లేదా NRO ఖాతాను తెరవడానికి వాటిలో ఒక ఎంపికను ఎంచుకోవాలి.ఆపై వారు తమ KYC డాక్యుమెంట్లను బ్యాంకుకు సమర్పించాలి.
ఎన్నారైలు తమ KYC డాక్యుమెంట్లను ( KYC documents )భారతదేశంలోని SBI బ్రాంచ్లో వ్యక్తిగతంగా సమర్పించవచ్చు లేదా వారు వాటిని నోటరీ, ఇండియన్ ఎంబసీ, హైకమిషన్, ఎస్బీఐ ఫారిన్ ఆఫీస్ లేదా రిప్రజెంటేటివ్ ఆఫీస్ లేదా వారి హోస్ట్ దేశంలోని కోర్ట్ మేజిస్ట్రేట్ ద్వారా వెరిఫై చేయవచ్చు.వాటిని కేంద్రంగా నియమించబడిన శాఖకు మెయిల్ చేయవచ్చు.
ఎస్బీఐ యోనో యాప్ ( SBI Yono App )ఎన్నారైలు వారి అకౌంట్ అప్లికేషన్ల స్టేటస్ను రియల్-టైమ్లో ట్రాక్ చేయడానికి కూడా అనుమతిస్తుంది.భారతదేశంలో తమ ఖాతాలను తెరవడానికి, నిర్వహించడానికి మరింత అనుకూలమైన మార్గాన్ని చాలాకాలంగా అభ్యర్థిస్తున్న ఎన్నారైలకు ఈ కొత్త సేవ స్వాగతించే చర్య.ఇది ఆవిష్కరణ, కస్టమర్ సేవ పట్ల ఎస్బీఐ చూపిస్తున్న నిబద్ధతకు సంకేతం.ఎన్నారైల కోసం తీసుకొచ్చిన కొత్త ఎస్బీఐ యోనో సర్వీస్ భారతదేశానికి రెమిటెన్స్లను పెంచడంలో సహాయపడుతుంది.
ఎన్నారైలు భారతదేశంలో ఖాతాలను తెరవడం, నిర్వహించడం సులభతరం చేయడం ద్వారా, ఈ సేవ వారి స్వదేశానికి మరింత డబ్బును తిరిగి పంపేలా వారిని ప్రోత్సహిస్తుంది.రెమిటెన్స్లు అంటే ఎన్నారైలు, విదేశీ కార్మికులు భారతదేశంలోని వారి తల్లిదండ్రులు, బంధువులు, ఇతర కుటుంబ సభ్యులకు బదిలీ చేసే విదేశీ నిధులు.