నవ మాసాలు మోసి పెంచి పోషించి ఒక మనిషిగా తీర్చిదిద్దిన కన్నతల్లిపై ఒ కసాయి కొడుకు కిరాతకంగా ప్రవర్తించాడు.కన్నతల్లి చిన్నప్పటి నుంచి తన కొడుకుకి మంచి మాటలు చెప్పి, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, మన వల్ల ఎవరికి ఏ హాని జరగకూడదని చెబుతూ తన కొడుకును పెంచుతుంది.
ఒక కన్నా తల్లి గురించి చాలా గొప్పగా చెప్పాలంటే, తల్లి పాదాల క్రింద స్వర్గం ఉందని కొంతమంది మహానుభావులు చెబుతారు.
గుడికి వెళ్లి దేవునికి పూజ చెయ్యలేని వారు తల్లిని సంతోషంగా చూసుకుంటే దేవుడు వారికి స్వర్గాన్ని ప్రసాదిస్తాడని దీని అర్థం.
భగవంతుని దగ్గర అంతా గొప్ప స్థానం ఉన్నా తల్లిని ఒక తాగుబోతు కొడుకు ఇంత కిరాతకంగా హింసిస్తున్నాడో వీడియోలో చూస్తే ఎవరికైనా రక్తం మరిగిపోతుంది.కాకినాడ జిల్లా కాజులూరు మండలం పల్లెపాలెం గ్రామంలో కన్న తల్లి అని చూడకుండా ఆ కసాయి కొడుకు చిత్ర హింసలకు గురిచేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ మారింది.
పల్లెపాలెం గ్రామానికి చెందిన వెంకన్న అనే యువకుడు వృద్దాప్యం లో ఉన్న తన తల్లి లక్ష్మీ ని కింద పడవేసి కాళ్లతో ఎలా పడితే అలా కొడుతున్న వీడియో హృదయాన్ని కలిచివేస్తుంది.కడపులో ఉన్నప్పుడు కాళ్లతో తంతే ఆ తల్లి ఆనందంగా భరిస్తుంది.కానీ ఇప్పుడు ఆ కొడుకు తన తల్లిని కాళ్లతో కొడుతూ ఉంటే విన్నీ అసలు ఎందుకు కన్నానా అని ఆ తల్లి బాధపడుతూ ఉంటుంది.ఆ కొడుకు తల్లి పీక పై కాళ్లు వేసి తొక్కుతూ మానవత్వం లేని మృగంగా ప్రవర్తిస్తున్నాడు.
సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరిస్తున్న ఈ మానవ మృగం పై పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.విషయం తెలిసుకున్న బందువులు వృద్దురాలును యానం ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు.