సమంత ఒంటరితనానికి అవి రెండూ తోడు.. నెట్టింట్లో వైరల్ పోస్ట్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సమంత ప్రస్తుతం మయోసైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్న విషయం మనందరికీ తెలిసిందే.

ఇటీవలె ఆమె వ్యాధితో బాధపడుతున్నట్టు తెలిపి అభిమానులను ఒక్కసారిగా షాక్ ఇచ్చింది.హెల్త్ బాగా లేకపోయినా కూడా సమంత తన సినిమాలకు సంబంధించిన ప్రమోషన్స్ లో పాల్గొంటూనే ఉంది.

ఇకపోతే సమంత విడాకులు తీసుకున్న తర్వాత ఒంటరిగా నివసిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.ఆమెతోపాటు హాష్, సాషా అనే రెండు శునకాలు కూడా ఉన్నాయి.

సమంత సోషల్ మీడియాలో పది పోస్ట్ చేస్తే అందులో ఆరు పోస్టులు ఆ శునకాల గురించి ఉంటుంది అని చెప్పవచ్చు.హాష్, సాషా అనేవి సమంతా పెట్ డాగ్స్ అన్న విషయం అందరికీ తెలిసిందే.

Advertisement

అయితే నాగచైతన్యతో విడిపోక ముందు నుంచి సమంత దగ్గర హాష్ ఉంది.తర్వాత మళ్ళీ కొత్తగా సాషా అనే కొత్త డాగ్ ని కొనుగోలు చేసింది సమంత.

ఇక తనకు సమయం దొరికినప్పుడల్లా వాటితో సమయాన్ని గడుపుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.

రెండు పెట్టు డాగ్స్ ని సొంత పిల్లల మధ్యగా చూసుకుంటూ ఉంటుంది.అంతే కాకుండా ప్రస్తుతం ఒంటరిగా ఉన్న సమంతకి ఆ రెండు పెట్ డాగ్స్ అండగా, తోడుగా ఉన్నాయని చెప్పవచ్చు.ఇది ఇలా ఉంటే తాజాగా సమంత ఆ రెండు పెట్ డాగ్స్ ఉద్దేశిస్తూ ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేసింది.

అందుకు సంబంధించిన పోస్ట్ ఇంస్టాగ్రామ్ లో తెగ వైరల్ అవుతోంది.కాగా ఆ పోస్టులో సమంత ఒక సోఫాలో బోర్ల పడుకొని ఉండగా హాష్ సమంత వీపుపై కాలు పెట్టింది.

మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాలకృష్ణ.. ఏంటో తెలుసా?
మొదటి సినిమాతోనే రికార్డ్ లు బ్రేక్ చేయాలని చూస్తున్న స్టార్ హీరో కొడుకు..?

అందుకు సంబంధించిన ఫోటోని సమంత తన అభిమానులతో పంచుకుంటూ ఆ ఫోటోకి ఈ విధంగా క్యాప్షన్ జోడించింది.నువ్వు బాధపడకమ్మా నీ వెనుక నేనున్నా.నీకు ఏమైనా చూసుకోవడానికి నేనున్నా అని హాష్ తనకు ధైర్యం చెబుతున్నట్టుగా కామెంట్ కూడా రాసుకొచ్చింది.

Advertisement

ఇకపోతే సమంత సినిమాల విషయానికి వస్తే.సమంత నటించిన యశోద సినిమా ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే.

సమంత నటించిన మరో సినిమా శాకుంతలం త్వరలోనే విడుదల కానుంది.

తాజా వార్తలు