ఒకప్పుడు సినీ పరిశ్రమలో హీరోయిన్లు వయసైపోయేంతవరకు నటించేవారు.కానీ ఇప్పుడు పరిస్థితి వేరు.
ఈ కాలంలో ఒకటి, రెండు చిత్రాలతోనే హీరోయిన్ల భవిష్యత్తు తెలిసిపోతుంది.కొందరు మొదటి చిత్రం తోనే స్టార్లుగా మారిపోతుంటే…మరీ కొందరు మాత్రం ఒకటి, రెండు సినిమాలు చేసాక కనుమరుగైపోతున్నారు.
తాజాగా ఒక తెలుగు హీరోయిన్( Telugu Heroine ) గుండు చేసుకొని ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈమె తెలుగులో హీరోయిన్ గా చేసింది రెండు సినిమాలే అయినా, ఆమె నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇంతకీ ఆమె ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా?
![Telugu Repallelo Radha, Telugu, Tirupati, Tollywood-Movie Telugu Repallelo Radha, Telugu, Tirupati, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/08/Heroine-Gayathri-Raghuram-latest-look-viral-detailsd.jpg)
గాయత్రీ రఘురాం….( Gayathri Raghuram ) ఈమె అందరికి తెలియకపోవచ్చు.ఎందుకంటె ఈమె చాల తక్కువ చిత్రాలలో నటించింది.ఈమె నటించిన మొదటి చిత్రం “రేపల్లెలో రాధ”.( Repallelo Radha ) ఈ చిత్రం 2001 లో విడుదలయింది.ఐతే ఈ చిత్రం అనుకున్న విజయం సాధించలేదు.
ఈమె నటించిన రెండో చిత్రం “బాపుబొమ్మకు పెళ్ళంటా”.( Bapubommaku Pellanta Movie ) 2003లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది.
ఈ చిత్రంలో రెండు జాడలు వేసుకొని కుందనపు బొమ్మలా ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టిన అమ్మాయే ఈ గాయత్రీ రఘురాం. రెండో చిత్రంతోనే ఫేమస్ ఐనప్పటికీ, ఈమె తరువాత చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్నారు.2006 లో దీపక్ చంద్రశేఖర్ అనే వ్యక్తిని పెళ్లి కూడా చేసుకుంది.కానీ కొన్ని కారణాల వల్ల వీరు 2010 లో విడాకులు తీసుకున్నారు.
![Telugu Repallelo Radha, Telugu, Tirupati, Tollywood-Movie Telugu Repallelo Radha, Telugu, Tirupati, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/08/Heroine-Gayathri-Raghuram-latest-look-viral-detailss.jpg)
తరువాత ఆమె కొంత కాలం బీజేపీ తో( BJP ) కలిసి పని చేసారు.కొంత కాలం తరువాత పార్టీ నుంచి బయటకు వచ్చి తిరిగి సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టారు.నితిన్ హీరోగా నటించిన “రంగ్ దే”( Rang De Movie ) సినిమాలో హీరో సోదరిగా నటించింది గాయత్రి.ఈమె కొన్ని స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది.
ఐతే ఈమె ఈమధ్యే తిరుపతి వెళ్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.అక్కడ తలనీలాలు కూడా సమర్పిచారు.
ఈ సందర్భంగా కొన్ని ఫోటోలను సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు.ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు, గుర్తుపట్టలేనంతగా మారిన గాయత్రిని చూసి షాక్ అవుతున్నారు.