యంగ్ టాలెటెండ్ దర్శకుడుతో హీరోగా రామ్ నెక్స్ట్ మూవీ

ఎనర్జిటిక్ హీరోగా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు రామ్.ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కెరియర్ లో చాలా కాలం తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకోవడంతో పాటు కమర్షియల్ హీరోగా తనని థాని ఎలివేట్ చేసుకున్నాడు.

ఇందులో రామ్ పోషించిన పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది.ఇక ఈ సినిమాకి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ కూడా ఉంటుందని గతంలో పూరి జగన్నాథ్, రామ్ ప్రకటించారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం రామ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో మూడో సారి నటిస్తున్నాడు.తమిళ్ హిందీ మూవీ రీమేక్ గా రామ్ రెడ్ సినిమా తెరకెక్కింది.

ఇందులో రామ్ కెరియర్ లో మొదటి సారి ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.రెండు భిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలలో సందడి చేయబోతున్నాడు.

Advertisement

ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ చేసుకున్న థియేటర్ లో రిలీజ్ చేయడం కోసం వెయిట్ చేస్తున్నాడు.ఇదిలా ఉంటే ఇప్పుడు రామ్ మరో కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

అది కూడా ఎవరూ ఊహించని దర్శకుడుకి అవకాశం ఇచ్చాడు.మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా అనే సినిమాలతో ఫీల్ గుడ్ క్లాస్ ఎంటర్టైనర్ చిత్రాలు తీసిన దర్శకుడు వివేక్ ఆత్రేయ చెప్పిన ఓ కథకి రామ్ కనెక్ట్ అయ్యి ఒకే చెప్పేసినట్లు తెలుస్తుంది.

ఈ సినిమా కూడా ఫీల్ గుడ్, అండ్ క్లాన్ కంటెంట్ తోనే కామెడీ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని సమాచారం.ఈ సినిమాకి సంబందించిన చర్చలు ప్రస్తుతం జరుగుతున్నాయని, అలాగే ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ని దర్శకుడు వివేక్ ఆత్రేయ చేసే పనిలోఉన్నాడని టాక్.

త్వరలో ఈ సినిమా గురించి అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తుందని తెలుస్తుంది.

నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...
Advertisement

తాజా వార్తలు