పెండింగ్ ప్రాజెక్ట్ లు పూర్తి చేసిన తర్వాతనే కొత్త సినిమా... నాని కీలక నిర్ణయం

నేచురల్ స్టార్ నాని శివ నిర్వాణ దర్శకత్వంలో చేసిన టక్ జగదీష్ సినిమా రిలీజ్ కి రెడీ అయ్యింది.

ఇప్పటికీ మూవీ రిలీజ్ కావాల్సి ఉన్న కోవిడ్ సెకండ్ వేవ్ సిచువేషన్ వల్ల వాయిదా పడింది.

కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీపై ఇప్పటికే పాజిటివ్ టాక్ ఉంది.ఫ్యామిలీ కోసం ఏమైనా చేసే యువకుడి పాత్రలో ఈ సినిమాలో నాని కనిపించబోతున్నాడు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో శ్యామ్ సింగరాయ్ అనే పిరియాడిక్ మూవీని నాని చేస్తున్నాడు.ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

నాని కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా మూవీని పాన్ ఇండియన్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు.ఇందులో న్యాచురల్ స్టార్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన సినిమాపై హైప్ క్రియేట్ చేసింది.సాయి పల్లవి, కృతిశెట్టి ఈ సినిమాలో నానికి జోడిగా కనిపించబోతున్నారు.

ఇదిలా ఉంటే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న ఈ మూవీ తర్వాత వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో అంటే సుందరానికి అనే రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ మూవీలో నాని నటించాల్సి ఉంది.ఈ మూవీస్ షూటింగ్ ప్రారంభించిన కొద్దిరోజులకే కరోనా ఎఫెక్ట్ కారణంగా వాయిదా పడింది.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం నాని ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుత పెండింగ్లో ఉన్న శ్యామ్ సింగరాయయ్, అంటే సుందరానికి సినిమాలు పూర్తి చేసిన తర్వాతనే నెక్స్ట్ సినిమాని స్టార్ట్ చేయాలని భావిస్తున్నారని టాక్ వినిపిస్తుంది.

ఈ కారణంగా కొత్త కథలు ఏవి కూడా వినడం లేదని సమాచారం.వీటి తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో సినిమాని స్టార్ట్ చేసే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ సర్కిల్ లో వినిపిస్తుంది దాంతోపాటు నానితో సినిమా కోసం మరో ముగ్గురు దర్శకులు వెయిటింగ్ లో ఉన్నట్లు సమాచారం .

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?
Advertisement

తాజా వార్తలు