సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘SSMB28’.ఈ సినిమా కంటే ముందే మహేష్ సర్కారు వారి పాట సినిమాతో ఘన విజయం అందుకున్నాడు.
ఇది రిలీజ్ అయ్యి నెలలు గడుస్తున్న మొన్నటి దాకా త్రివిక్రమ్ సినిమా సెట్స్ మీదకు వెళ్ళలేదు.ఏదో ఒక కారణంతో వాయిదా పడుతూనే ఉంది.
ఎట్టకేలకు స్టార్ట్ అయ్యి రెగ్యురల్ షూట్ కూడా మొదలు పెట్టి ఫస్ట్ షెడ్యూల్ అయితే ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేసారు.కొద్దిగా గ్యాప్ ఇచ్చి సెకండ్ షెడ్యూల్ చేయాలని అనుకున్న త్రివిక్రమ్ కు మహేష్ కారణంగా వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది.
దీంతో మహేష్ ఈ సినిమాకు గ్యాప్ ఇచ్చాడు.అయితే ఈ డిసెంబర్ లో స్టార్ట్ అవుతుంది అని అంతా అనుకున్నారు.
కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ను డిసెంబర్ లో కూడా స్టార్ట్ కానట్టే కనిపిస్తుంది.ఎందుకంటే అతి త్వరలోనే త్రివిక్రమ్, నాగ వంశీ, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం దుబాయ్ వెళ్లనున్నారని.
అక్కడ ట్యూన్స్ పక్కాగా సెట్ అయిన తర్వాత జనవరి ఫస్ట్ వీక్ లో సెకండ్ షెడ్యూల్ ను స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.దీంతో ఈ సినిమా అనుకున్న సమయానికి వస్తుందా రాదా అనే డౌట్స్ వస్తున్నాయి.ఇక ఈ సినిమాలో మహేష్ కు జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే హారిక హాసిని బ్యానర్ పై రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.