టాలీవుడ్ మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఆర్సీ 15 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈయన నటించిన రెండు సినిమాలు వెంట వెంటనే రిలీజ్ అయ్యాయి.
ఒకటి భారీ హిట్ అవ్వగా.మరొకటి మాత్రం భారీ ప్లాప్ అయ్యింది.
ట్రిపుల్ సినిమా ఈయనకు పాన్ ఇండియా వ్యాప్తంగా మంచి పేరు తెచ్చిపెట్టింది.అయితే ఇటీవలే రిలీజ్ అయినా ఆచార్య మాత్రం మెగా హీరోల కెరియర్ లోనే భారీ ప్లాప్ గా మిగిలి పోయింది.
అయితే చరణ్ మాత్రం హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా ఆయన ఒప్పుకున్న సినిమాలను చేసుకుంటూ పోతున్నాడు.ప్రెసెంట్ ఈయన ఆర్సీ 15 షూట్ లో బిజీగా ఉన్నాడు.
ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.ఇక శంకర్ తో సినిమా అంటే ఎలా ఉంటుందో అందరికి తెలుసు.
ఈయన సినిమాలు వరల్డ్ వైడ్ క్రేజ్ ఉన్నాయి.ఇటీవలే అమృత్ సర్ లో ఈ సినిమా షూటింగ్ ముగించుకుంది.
ఇక ఇప్పుడు కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది.ఈ షెడ్యూల్ వైజాగ్ లో స్టార్ట్ అయ్యి శరవేగంగా జరుగుతుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా యమ స్పీడ్ గా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది.ఇప్పుడు వైజాగ్ లో జరుగుతున్న షెడ్యూల్ లో కియారా కూడా పాల్గొంది.
ఈ క్రమంలోనే తాజాగా ఆర్కే బీచ్ లో చరణ్ కు తదితరులకు మధ్య గొడవ సన్నివేశాలను షూట్ చేస్తున్నట్టు చెబుతున్నారు.
అలాగే కియారా, చరణ్ మధ్య వచ్చే సన్నివేశాలను కూడా ఆర్కే బీచ్ లో షూట్ చేస్తున్నారట.ఈ సన్నివేశాలను శంకర్ తనదైన శైలిలో షూట్ చేస్తున్నాడని అంటున్నారు.అలాగే ఈ సినిమాలోని పాటలను ఫారిన్ లొకేషన్స్ లో ప్లాన్ చేసాడట.
ఈ పాటలకు కూడా కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నట్టు టాక్.ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని అంతా ఎదురు చూస్తున్నారు.