టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందారు.పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందిన తర్వాత కొరటాల శివ, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమాలు చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అయితే ఈ సినిమా మరింత ఆలస్యం కావడంతో ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి హాలిడే వెకేషన్ వెళ్లారు.ఎన్టీఆర్ తన కుటుంబంతో ఇంగ్లాండ్ వెకేషన్ లో ఉండగా ఆయన అక్కడ తన భార్యతో కలిసి ఒక క్యూట్ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేశారు.
చుట్టూ పచ్చదనం మధ్యలో ఎన్టీఆర్ ప్రణతి ఎదురెదురుగా ఒక బల్లపై కూర్చుని కాఫీ తాగుతూ ఉన్నటువంటి ఫోటోని షేర్ చేస్తూ ఇలాంటి క్షణాలు అంటూ క్యాప్షన్ జోడించారు.అయితే ఈ ఫోటో షేర్ చేసిన కొద్దిసేపటికి తన అత్తయ్య ఉమామహేశ్వరి చనిపోయారు.
నిజానికి తన అత్తయ్య మరణించిన విషయం ఎన్టీఆర్ కి అప్పటివరకు తెలియదు.అయితే కొందరు ఉద్దేశపూర్వకంగానే ఇక్కడ మేనత్త చనిపోతే అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు అంటూ ఎన్టీఆర్ ను ట్రోల్ చేస్తున్నారు.
ఎన్టీఆర్ ఈ ఫోటో షేర్ చేసే సమయానికి తన అత్తయ్య మరణ వార్త తెలియదు అయితే ఈ విషయం తెలిసిన వెంటనే ఎన్టీఆర్ ఇంగ్లాండ్ నుంచి ఇండియా బయలుదేరినట్టు సమాచారం.ఇక వ్యక్తిగతంగా కూడా ఎన్టీఆర్ కు తన అత్తయ్య ఉమామహేశ్వరి అంటే ఎంతో ప్రాణం.ఎన్టీఆర్ వివాహంలో ఉమామహేశ్వరి దగ్గరుండి మేనత్త చేయవలసిన కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేశారు.ఇలా దగ్గరుండి తన బాధ్యతలను నిర్వర్తించడంతో ఎన్టీఆర్ కి ఈమంటే ఎనలేని అభిమానం.ఉమామహేశ్వరి మరణ వార్త తెలియడంతో ఎన్టీఆర్ ఇండియా వచ్చారని తెలుస్తోంది.