రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది.మూడు వేర్వేరు కేసుల్లో సుమారు రూ.4 కోట్లు విలువ చేసే బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుల వద్ద బంగారాన్ని గుర్తించారు.
మొత్తం ఏడు కేజీల 690 గ్రాముల బంగారాన్ని సీజ్ చేశారు.అనంతరం నలుగురు నిందితలను అరెస్ట్ చేశారు.
కొత్త కొత్త పద్ధతుల్లో గోల్డ్ ను అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.