టీడీపీ అధినేత చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది.ఈ మేరకు విచారణను న్యాయస్థానం వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
కేసు విచారణలో భాగంగా చంద్రబాబు తరపున న్యాయవాదులు సిద్దార్థ్ లూథ్రా, హరీశ్ సాల్వే వాదనలు వినిపించడగా అటు సీఐడీ తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు.ఈ క్రమంలో బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్లాలని సుప్రీం ధర్మాసనం సూచించింది.
తదుపరి విచారణ సమయానికి హైకోర్టులో సమర్పించిన అన్ని డాక్యుమెంట్లు తమ ముందు ఉంచాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ చేపట్టనుంది.