ఏపీ విద్యుత్ ఉద్యోగుల పిటిషన్ పై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది.విజయవాడలోని ధర్నాచౌక్ లో ఆందోళనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఉద్యోగులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో పిటిషన్ పై న్యాయస్థానం విచారణ చేపట్టగా ధర్నాకు అనుమతి ఇవ్వొద్దని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.మరోవైపు వెయ్యి మందితో ధర్నా నిర్వహించేందుకు విద్యుత్ ఉద్యోగులు అనుమతి కోరారు.
ఈ క్రమంలో ఐదు వందల మందితో ధర్నా చేసుకునే అంశాన్ని పరిశీలించాలని హైకోర్టు సూచించింది.అనంతరం తదుపరి విచారణను ఈనెల 31వ తేదీకి వాయిదా వేసింది.