మీరు విన్నది నిజమే.ఓ బలిసిన వ్యాపారి 20 రూపాయల కోసం కక్కుర్తిపడి ఏకంగా రూ.6,020 జరిమానా కట్టాడు.ఈ ఘటన మైసూరులో జరగగా తాజాగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే.మైసూరులో రిటైర్డు టీచర్ సత్యనారాయణ 2019లో ఓ షాపులో 3 శారీ ఫాల్స్ను కొనుగోలు చేశాడు.అవి ఒక్కొక్కటి రూ.30 కాగా మొత్తం రూ.90 ఆ వ్యాపారి తీసుకోవాలి కదా.కానీ అతగాడు మాత్రం రూ.110 వసూలు చేశాడు.ఎందుకు ఎక్కువ తీసుకున్నావని టీచర్ ప్రశ్నించగా ఆ వ్యాపారి చాలా అసభ్యకర పదజాలంతో దూషించాడు.
దీంతో టీచర్ సత్యనారాయణ వ్యాపారిపై కేసు వేసి రూ.61వేల పరిహారాన్ని ఇప్పించాలని కోరాడు.మూడేళ్లపాటు జరిగిన విచారణలో వ్యాపారి చేసింది తప్పని తేలడంతో కోర్టు ఆ వ్యాపారికి రూ.6,020 జరిమానా విధించింది.విషయం తెలిసిన స్థానికులు వ్యాపారికి తిక్క కుదిరిందని సంబర పడుతున్నారు.20 రూపాయిల కోసం మూడేళ్ళ పాటు ఈ రాద్ధాంతం ఎందుకు అని టీచర్ ని ప్రశ్నించగా… “20 రూపాయిలు అనేది సమస్య కానేకాదు.ఆ వ్యాపారి చేస్తున్న అక్రమాలను అరికట్టి, బుద్ధి చెబుదామనే ఇలా మూడేళ్లపాటు పోరాడాను!” అని చెప్పుకొచ్చాడు.
సరిగ్గా ఇలాంటి సంఘటనే ఆ మధ్య రాజస్తాన్లో జరిగింది.సుజీత్ స్వామి అనే ఇంజనీర్ రైల్వే నుంచి తనకు రావాల్సిన 35 రూపాయలను సుమారు ఐదేళ్ల పాటు పోరాడి మరీ సాధించుకున్నాడు! ఈ క్రమంలో ఈయన చేసిన పోరాటం దేశవ్యాప్తంగా మరో 3 లక్షల మందికి లబ్ధి చేకూరేలా చేసింది.2017 జూలై 2న కోటా నుంచి ఢిల్లీ వెళ్లేందుకు ఆ ఏడాది ఏప్రిల్లో స్వామి టికెట్ బుక్ చేసుకున్నాడు.తర్వాత దాన్ని రద్దు చేసుకున్నాడు.క్యాన్సలేషన్లో భాగంగా 35 రూపాయల సర్వీస్ చార్జిని కూడా టికెట్ డబ్బుల్లోంచి రైల్వే శాఖ మినహాయించుకుంది.ఈ విషయమై స్వామి వేసిన కేసు ఫలించి మంచి ఫలితం వచ్చింది.