జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి అంటారు పెద్దలు.కొందరిని చూడగానే ఈ సామెత నిజమే అనిపిస్తుంది.
ఎందుకంటే వారు ప్రవర్తించే తీరు అలా ఉంటుంది.నలుగురితో నారాయణ, గుంపులో గోవిందా అని ఉండకుండా నలుగురిలో తాము ప్రత్యేకం అని నిరూపించుకునేందుకు తహతహలాడుతుంటారు.
దాని కోసం విలువైన వస్తువులను కూడా తగలేస్తుంటారు.ఇక దీపావళిని కొందరు ఇదే తరహాలో జరుపుకున్నారు.
విలువైన కారుకు నిండా టపాసులు అతికించి పేల్చేశారు.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
మన దేశంలో కారు కొనుక్కోవాలంటే మధ్య తరగతి వారు ఎంతో ఆలోచిస్తారు.అప్పు చేసి, లేదా ఈఎంఐలలో కారు కొనుక్కుంటుంటారు.కొందరైతే ఆ మాత్రం కూడా ఖర్చు పెట్టే స్తోమత ఉండదు.ఈ నేపథ్యంలో సెకండ్ హ్యాండ్లో కాస్త తక్కువ ధరకే కారు కొనుగోలు చేస్తారు.ఎలాంటి కారు అయినా చాలా మంది దానిని అపురూపంగా చూసుకుంటారు.అయితే క్రేజీ ఎక్స్వైజెడ్ అనే యూట్యూబ్ ఛానల్ వారు మాత్రం కొత్త తరహాలో దీపావళి జరుపుకున్నారు.
తమ కారుకు నిండా లక్ష టపాసులను అంటించారు.అద్దం వదిలేసి, మిగిలిన భాగం అంతా టపాసులతో కప్పేశారు.
ఆ తర్వాత ఒకదానికి టపాసులను నిప్పు అంటించారు.అంతే.
చూడగానే క్షణాల్లో ఆ కారుపై ఉన్న టపాసులన్నీ భారీ శబ్దంతో పేలిపోయాయి.అయితే కారు అద్దానికి టపాసులు లేకపోయినా, మిగిలిన ప్రాంతంలో పేలిన టపాసుల వేడికి కరిగి మెత్తగా అయిపోయి, పేలిపోయింది.
కారు మొత్తం తెల్లగా ఉండే టపాసులు పేలిన తర్వాత నల్లగా మారిపోయింది.నామరూపాల్లేని ఆ కారును తర్వాత స్టార్ట్ చేయగా, చక్కగా పని చేసింది.
ఈ ప్రయోగం చూసిన నెటిజన్లు వీరికి ఇదేం బుద్ధి అంటూ కామెంట్లు పెడుతున్నారు.చక్కని కారును సోషల్ మీడియాలో లైకుల కోసం పాడు చేస్తారా అంటూ విమర్శిస్తున్నారు.