మౌలిక వసతులు కావాలని ప్రశ్నించిన ప్రజలకు నాశనం అయిపోతారంటూ ఓ ఎమ్మెల్యే శాపనార్దాలు పెట్టాడు.ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.
తొమ్మిదవ డివిజన్ పర్యటనలో భాగంగా సైడ్ కాల్వల శంకుస్థాపనకు వెళ్లారు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ముస్తాఫా.ఈ క్రమంలో అండర్ డ్రైనేజీ కావాలని డిమాండ్ చేస్తూ ప్రజలు అడ్డుకున్నారు.
దీంతో ప్రజలకు, ఎమ్మెల్యేకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.ఈ క్రమంలోనే నాశనమైపోతారంటూ వ్యాఖ్యానించారని తెలుస్తోంది.
ఎమ్మెల్యే తీరుపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.