ఇటీవల రోజుల్లో చాలా మంది చిన్న వయసులోనే ముడుతల సమస్య( Wrinkles )తో బాధపడుతున్నారు.మచ్చలు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఏదో ఒక కారణం చేత ముఖంపై మచ్చలు పడుతూనే ఉంటాయి.ఇవి చర్మ సౌందర్యాన్ని తీవ్రంగా పాడు చేస్తాయి.
అయితే ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ రెమెడీ ముడతలు, మచ్చలను మాయం చేయడమే కాదు మీ ముఖ చర్మాన్ని వైట్ గా బ్రైట్ గా కూడా మారుస్తుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక కప్పు పాలు పోసుకోవాలి.పాలు హీట్ అవ్వగానే అందులో మూడు టేబుల్ స్పూన్లు ఓట్స్ వేసి పది నిమిషాల పాటు ఉడికించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఓట్స్ వేసి ఉడికించిన పాలను ఫిల్టర్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి.పూర్తిగా కూల్ అయిన అనంతరం ఈ ఓట్స్ మిల్క్( Oats Milk ) లో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్, వన్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్, వన్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
తద్వారా ఒక మంచి ఫేస్ టోనర్( Face Toner ) సిద్ధం అవుతుంది.ఈ హోమ్ మేడ్ టోనర్ ను ఒక బాటిల్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.
ఈ టోనర్ ను ముఖానికి అప్లై చేసుకుని వేళ్ళతో సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.కనీసం ఐదు నుంచి పది నిమిషాల పాటు మసాజ్ చేసుకుని ఆపై చర్మాన్ని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
అనంతరం ఫేస్ వాష్ చేసుకోవాలి.

ఈ విధంగా రోజుకు ఒకసారి కనుక చేస్తే ఎలాంటి మచ్చలు ఉన్నా సరే దెబ్బకు పరార్ అవుతాయి.అలాగే ముడతలు క్రమంగా మాయం అవుతాయి.చర్మం టైట్ గా యవ్వనంగా మారుతుంది.
అదే సమయంలో ఈ హోమ్ మేడ్ టోనర్ ను వాడటం వల్ల స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది.చర్మం సూపర్ వైట్ గా బ్రైట్ గా( Skin Whitening ) మెరుస్తుంది.
కాబట్టి ముడతలు మచ్చలు లేని తెల్లని మెరిసే ముఖ చర్మాన్ని కోరుకునేవారు తప్పకుండా ఇప్పుడు చెప్పిన టోనర్ ను ఖచ్చితంగా తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.