ఆర్ధిక ఇబ్బందులు కావొచ్చు.కుటుంబాన్ని ఇంకా బాగా చూసుకునే ఆలోచన కావొచ్చు.
ఏదైతేనేం.భారతీయులు( Indians ) ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారు.
కానీ అక్కడ అడుగుపెడితే కానీ అసలు విషయం తెలియదు.గల్ఫ్ గోసలు అంతా ఇంతా అని చెప్పలేము.
గల్ఫ్ కష్టాలు పగవాడికి కూడా రావద్దని అక్కడి నుంచి తిరిగి వచ్చిన బాధితులు చెబుతుంటారు.కార్మికులను మభ్యపెట్టి సందర్శకుల పేరిట వారిని ట్రావెల్ ఏజెంట్లు తరలించే పద్ధతి ఇప్పటికీ కొనసాగుతోంది.
గడువు ముగిసిన తరవాతా వీరు అక్కడే ఉండిపోతున్నారు.అక్కడి చట్టాలు కఠినంగా ఉండటంతో వీసాలు, పాస్పోర్టులు ( Visas , passports )లేనివారు రహస్యంగా జీవిస్తున్నారు.
భారతీయ కార్మికుల భయం, బలహీనతలను ఆసరాగా తీసుకొని అక్కడి సంస్థలు, యజమానులు వారిని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు.

అలా దేశం కానీ దేశంలో యజమాని చెరలో మగ్గిపోయి ఎట్టకేలకు స్వదేశం చేరుకుంది ప్రీతమ్ కౌర్( Pritam Kaur ) (పేరు మార్చాం).ఆమె ఒమన్లో ఎన్నో కష్టాలు అనుభవించింది.సగం ఆహారం, సగం జీతంతో ఇబ్బందులు పడి ఓ గురుద్వారాను చేరుకుని అక్కడి నుంచి భారతదేశానికి రాగలిగింది.
రాజ్యసభ సభ్యుడు బల్బీర్ సింగ్ సీచెవాల్ ( Balbir Singh Seechewal )ప్రత్యేకంగా చొరవ తీసుకుని ప్రీతమ్ కౌర్, మరో నలుగురిని క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చారు.మస్కట్, ఒమన్లలో( Muscat, Oman ) భారీ జీతాలు ఆశపెట్టి వీరు ఐదుగురిని ట్రావెల్ ఏజెంట్లు బుట్టలో వేసుకున్నారు.
తీరా అక్కడికి వెళ్లాక గానీ తాము మోసపోయినట్లు వీరు గ్రహించలేకపోయారు.గంటల తరబడి పనిచేయించుకుని తక్కువ జీతాన్ని వీరి చేతిలో పెట్టారు.దీనికి తోడు శారీరకంగా, మానసికంగా వేధింపులు సైతం ఎదుర్కొన్నారు.

ఈ ఐదుగురు బాధితులు పంజాబ్లోని జలంధర్, ఫిరోజ్పూర్, మోగా, కపుర్తలా జిల్లాలకు చెందినవారు.ఈ ఏడాది ఆగస్ట్ 23 నుంచి ఇప్పటి వరకు గల్ఫ్ దేశాల్లో మగ్గుతున్న దాదాపు 15 మంది బాధితులను ఎంపీ సీచెవాల్ వెనక్కి తీసుకొచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.
ట్రావెల్ ఏజెంట్ల మోసాలపై ప్రజలు అవగాహన కలిగి వుండాలన్నారు.భారత ప్రభుత్వం, గల్ఫ్ దేశాల్లోని భారత రాయబార కార్యాలయాల మద్ధతుతో 15 మంది మహిళలను వెనక్కి తీసుకొచ్చానని ఎంపీ చెప్పారు.15 మందిలో 13 మంది ఒమన్ నుంచి, ఇద్దరు ఇరాక్ నుంచి వచ్చినట్లుగా సీచెవాల్ తెలిపారు.