గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది.ఈ మేరకు సంకల్ప పత్ర్ పేరుతో జాతీయ నాయకుడు జేపీ నడ్డా మేనిఫెస్టో విడుదల చేశారు.
యువతకు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని తెలిపారు.పీఎం ఆరోగ్య బీమా రూ.10 లక్షలకు పెంచుతామని పేర్కొన్నారు.అదేవిధంగా ఐదేళ్లలో మహిళలకు లక్ష ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని జేపీ నడ్డా వెల్లడించారు.
విద్యార్థినులకు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటీలు ఇవ్వడంతో పాటు ద్వారక ఆలయ కారిడార్ ను నిర్మిస్తామని తెలిపారు.రెండు మెడికల్ సిటీలు, రెండు ఎయిమ్స్ లు కడతామని మేనిఫెస్టో ప్రకటించారు.