మిర్యాలగూడలో వందేభారత్ రైలు ఒక్క నిమిషం ఆగెందుకు గ్రీన్ సిగ్నల్

నల్లగొండ జిల్లా:మిర్యాలగూడ పట్టణంలోని రైల్వే స్టేషన్ నుండి నిత్యం తిరుపతి వివిధ ప్రాంతాలకు వందలాది మంది ప్రయాణిస్తూ వుంటారు.ఈ నేపథ్యంలో ఈ స్టేషన్ నుండి వెళుతున్న వందే భారత్ రైలుకు మిర్యాలగూడలో స్టాప్ కల్పించాలని ఈ ప్రాంత వాసులు రైల్వే అధికారులకు చాలా సార్లు విన్నవించుకున్నారు.దీనికి రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించి, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి తిరుపతి వెళ్లే వందే భారత్ రైలును మిర్యాలగూడ రైల్వేస్టేషన్ లో ఉదయం 7:55 నిముషాలకు,రాత్రి 9.22 నిముషాలకు ఒక్క నిమిషం పాటు ఆపే విధంగా చర్యలు తీసుకున్నారు.వందేభారత్ రైలుకు స్టాప్ కలించినందుకు మిర్యాలగూడ ప్రాంతవాసులు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తూ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

 Green Signal For Vande Bharat Train To Stop In Miryalaguda For One Minute , Mir-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube