మిస్టరీగా మారిన విశాఖలో టీచర్ మరణం?

ఒంటరిగా జీవిస్తున్న ఓ మహిళ ఆత్మహత్య మిస్టరీగా మారింది.ఉన్నట్టుండి తన ఇంట్లో శవం అయ్యి కనిపించింది.

చూడటానికి ఆత్మహత్యలా ఉన్నప్పటికి అది ఆత్మహత్య లేక హత్య అని దర్యాప్తు ప్రారంభించారు.ఈ విషాద ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.పాడేరు డివిజన్‌లోని హుకుంపేట మండలం శోభకోట గ్రామానికి చెందిన కామేశ్వరి గవర్నమెంట్ టీచర్ గా పని చేస్తుంది.

గతంలో ఆమెకు పెళ్లి కాగా ఆమె భర్తతో విబేధాలు వచ్చి విడిపోయింది.దీంతో కొయ్యూరు మండలం చిట్టింపాడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తూ అక్కడే ఒంటరిగా ఉండేవారు.

Advertisement

అయితే ఏమైందో ఏమో తెలియదు.ఉన్నట్టుండి తన ఇంట్లో ఆమె శవం అయ్యి కనిపించింది.

ఎన్ని సార్లు ఫోన్ చేసిన ఆమె ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆమె సోదరుడికి అనుమానం వచ్చి తోటి ఉపాధ్యాయులకు సమాచారం అందించగా వారు ఆమె ఇంటికి వెళ్లి చూశారు.అక్కడ ఆమె ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది.

దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా మృతుదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు