గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష్మీకి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అపాయింట్మెంట్ ఇచ్చేందుకు నిరాకరించారు.ఈ క్రమంలోనే డిప్యూటీ మేయర్ తో పాటు కార్పొరేటర్లు, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు.
అయితే ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై గవర్నర్ తమిళిసైకి ఫిర్యాదు చేయాలని మేయర్ భావించి, అపాయింట్మెంట్ కోరిన విషయం తెలిసిందే.గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో రాజ్ భవన్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు.







