గుడ్‌ లక్‌ సఖీ అనబోతున్న కీర్తి సురేష్‌

కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా మహేష్‌ కోనేరు నిర్మించిన మిస్‌ ఇండియా ఈ సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.

మహానటి చిత్రం తర్వాత కీర్తి సురేష్‌ చేసిన చిత్రం అవ్వడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.

మిస్‌ ఇండియాతో కీర్తి సురేష్‌ ఖచ్చితంగా మరో విజయాన్ని దక్కించుకుంటుందని అంతా నమ్మకంగా అనుకున్నారు.కాని తాజాగా కరోనా విపత్తు కారణంగా కీర్తి సురేష్‌ ఈ సమ్మర్‌లో రాలేక పోయింది.

మిస్‌ ఇండియాతో పాటు మరో సినిమాను కూడా కీర్తి చేసింది.

నగేష్‌ కుకునూరు దర్శకత్వంలో కీర్తి సురేష్‌ ఒక ద్వి భాష చిత్రాన్ని చేస్తుంది.ఆ సినిమాకు నిర్మాతగా దిల్‌ రాజు కూడా వ్యవహరిస్తున్నాడు.భారీ ఎత్తున ఈ చిత్రంను తెరకెక్కిస్తున్నారు.

Advertisement

కథ మరియు నేపథ్యం నచ్చడం వల్లే దిల్‌రాజు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చినట్లుగా తెలుస్తోంది.కీర్తి సురేష్‌కు తెలుగులో మంచి క్రేజ్‌ ఉన్న కారణంగా ఈ సినిమా మంచి వసూళ్లు నమోదు చేస్తుందనే నమ్మకంతో దిల్‌ రాజు ఈ నిర్ణయం తీసుకున్నాడు.

ఇక ఈ చిత్రంకు గుడ్‌ లక్‌ సఖీ అనే టైటిల్‌ను స్వయంగా దిల్‌రాజు ఖరారు చేశాడట.తెలుగు మరియు తమిళంలో ఇదే టైటిల్‌తో విడుదల కాబోతుంది.అంతకు ముందు వేరే టైటిల్‌ అనుకున్నా కూడా దిల్‌రాజు ఆ టైటిల్‌ కాదని గుడ్‌ లక్‌ సఖీ టైటిల్‌ను పెట్టాడు.

ఈ ఏడాది చివర్లోనే ఈ సినిమా వస్తుందని అంటున్నారు.

మీకు తెలుసా : సంక్రాంతి నెల రోజులు ఉండగానే ధనుర్మాసంలో గొబ్బెమ్మలు పెడతారు
Advertisement

తాజా వార్తలు