గోదావరి నది ఉగ్రరూపాన్ని దాల్చుతోంది.ఎగువ నుంచి వస్తున్న వరద కారణంగా భద్రాచలం వద్ద నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.భద్రాచలం వద్ద ప్రస్తుతం నీటిమట్టం 50.8 అడుగులకు చేరింది.గత మూడు రోజులుగా 2 అడుగుల మేర తగ్గిన వరద ప్రవాహం మళ్లీ పెరుగుతోంది.దీంతో అప్రమత్తమైన అధికారులు ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇటీవల వచ్చిన భారీ వర్షాలు, వరదలతో భద్రాచలం సహా పరిసర ప్రాంతాలు అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో మళ్లీ గోదావరి నీటిమట్టం పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.