ఈదురు గాలులకు ఊడిపోయిన రెండు ఆర్టీసీ బస్సుల అద్దాలు.. ప్రాణభయంతో ప్రయాణికుల ఆర్తనాదాలు

ఈదురు గాలులకు రెండు ఆర్టీసీ బస్సుల అద్దాలు ఊడిపోవడంతో ప్రయాణికులు ప్రాణభయంతో ఆర్తనాదాలు చేశారు.ఈ ఘటన ఆదివారం సాయంత్రం రావులపాలెం గౌతమి వంతెనపై చోటు చేసుకుంది.

 Glasses Of Two Rtc Buses Blown Away By Headwinds Details, Rtc Buses, Rtc Buses G-TeluguStop.com

కాకినాడ డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు 35 మంది ప్రయాణికులతో విజయవాడ నుంచి కాకినాడకు వస్తుండగా.సాయంత్రం 4.15 గంటల సమయంలో గౌతమి కి రాగానే ఒక్కసారిగా ఈదురుగాలు లతో కూడిన వర్షం పడింది.అద్దాలు పూర్తిగా మూసి ఉండటంతో బస్సు పడిపోయే స్థితిలో గాలికి ఊగింది.

బస్సులో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.పక్కకు చూస్తే గోదావరి ఉండటంలో గాలి కారణంగా బస్సు పడిపోతుందేమోనని భయంతో కేకలు వేశారు.

ఆ సమయంలో ముందుభాగాన ఉన్న అద్దం ఊడి రోడ్డుపైన పడింది. డ్రైవర్ వీరబాబు నెమ్మదిగా వంతెనను దాటించడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకు న్నారు.

రావులపాలెం నుంచి కాకినాడ వెళ్తున్న పల్లెవె తెలుగు బస్సుదీ అదే పరిస్థితి, వంతెన మీదకు వచ్చే సరికి ఈదురుగాలులకు ముందు భాగాన ఉండే రెండు అద్దాలు ఊడి పడిపోయాయి.ప్రయాణికులు ఒక్కసా రిగా ఉలిక్కి పడ్డారు.

డ్రైవర్ వెంటనే బస్సును నిలుపు దల చేసి ప్రయాణికులను వెనుక వస్తున్న మరో బస్సులో పంపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube