గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు కొత్త కమిషనర్ గా రోనాల్డ్ రోస్ నియామకం అయ్యారు.ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్న రొనాల్డ్ రోస్ ను జీహెచ్ఎంసీ కమిషనర్ గా నియమించింది.అదేవిధంగా ప్రస్తుత కమిషనర్ లోకేశ్ కుమార్ ను రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారిగా ఎన్నికల సంఘం నియమించింది.
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం లోకేశ్ కుమార్ ను బదిలీ చేసింది.మరోవైపు ఎక్సైజ్ శాఖ కమిషనర్ గా ఉన్న సర్ఫరాజ్ అహ్మద్ ను రాష్ట్ర సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.







