కృష్ణా జిల్లా ఆత్కూర్ వ్యవసాయ సహకార సంఘంలో ఘరానా మోసం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.సొసైటీలో విధులు నిర్వహిస్తున్న సెక్రటరీ, క్యాషియర్ లు ఫేక్ బాండ్లు క్రియేట్ చేసినట్లు సమాచారం.నకిలీ బాండ్లతో సుమారు 74 మంది రూ.4 కోట్ల డిపాజిట్లు వసూలు చేసినట్లు గుర్తించారు.ఈ నేపథ్యంలో మోసపోయినట్లు గుర్తించిన బాధితులు తీవ్ర మనస్తాపానికి గురై మృత్యువాత పడుతున్నారు.గత ఎనిమిది నెలల వ్యవధిలో ముగ్గురు చనిపోయారు.తాజాగా మరో బాధితుడు చనిపోవడంతో సహకార పరపతి సంఘం వద్ద బాధితులు ధర్నాకు దిగారు.దీంతో సొసైటీ కార్యాలయం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
తాజా వార్తలు