రంగారెడ్డి జిల్లా మైలర్దేవ్పల్లిలో గాంజా గ్యాంగ్ రెచ్చిపోయింది.చిన్న పిల్లల గొడవ ఆపడానికి వెళ్లిన నలుగురిపై దుండగులు దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది.
కర్రలు, రాళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు.ఈ క్రమంలోనే ఓ యువకుడిపై గ్యాంగ్ సభ్యులు కత్తితో దాడికి పాల్పడ్డారు.
దీంతో ప్రతిఘటించిన యువకుడు తప్పించుకున్నాడు.అనంతరం గాంజా గ్యాంగ్ అరాచకాలపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఐదుగురు దుండగులను అదుపులోకి తీసుకున్నారు.