అంతిమ యాత్రలో అపశృతి :బోల్తా పడిన వాహనం ,21 మందికి గాయాలు

కాన్వెంట్ జంక్షన్ వద్ద అంత్యక్రియలకు మృత దేహం తీసుకుని వెళ్తున్న వాహనం బోల్తా

 Funeral On The Final Journey: Overturned Vehicle, 21 Injured-TeluguStop.com

విశాఖలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.స్థానికులు అందించిన వివరాల ప్రకారం ఇలా ఉంది.

పూర్ణ మార్కెట్ సమీపంలోని రెల్లివీధిలో ఓ మూగ మనిషి అనారోగ్యంతో మృతి చెందారు.ఈ నేపథ్యంలో స్థానికులు పాడుకట్టి వాహనం మీద అంత్యక్రియలకు తరలిస్తుండి ఆచారం ప్రకారం కొబ్బరితోట పొలిమేర వద్ద పాడు దించారు.

అనంతరం దహన సంస్కరణలు నిమిత్తం కాన్వెంట్ సమీపంలోని చావులమదం శ్మశాన వాటికకు తరలిస్తుండగా ఈ నేపధ్యంలో ఆకస్మికంగా వాహనం తిరగబడి ప్రమాదం చోటుచేసుకుంది.ఈ ప్రమాదంలో వాహనం మీద ఉన్న సుమారు 21 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

గమనించిన పలువురు స్థానికులు ఘటన చోటుకు హుటాహుటిన చేరురుకొని గాయపడిన క్షతగాత్రులను విశాఖ కేజీహెచ్కు ఆటోల్లో తరలించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube