నేటి నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్ వరుస పర్యటనలు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి.ఇందులో భాగంగా హుస్నాబాద్ వేదికగా ఎన్నికల శంఖారావం పూరించిన గులాబీ బాస్ కేసీఆర్ ఇవాళ్టి నుంచి జిల్లాలో వరుస పర్యటనలు నిర్వహించనున్నారు.

 From Today, Telangana Cm Kcr Will Make A Series Of Visits-TeluguStop.com

ఇవాళ రెండు జిల్లాల్లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలకు కేసీఆర్ హాజరుకానున్నారు.మొదటగా జనగాం వెళ్లనున్న ఆయన తరువాత భువనగిరికి వెళ్లనున్నారు.

ఈ క్రమంలో కేసీఆర్ సభ కోసం జోరుగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.ఈ నేపథ్యంలోనే ప్రజా ఆశీర్వాద సభకు పార్టీ నేతలు భారీ జనసమీకరణ చేస్తున్నారు.

మరోవైపు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇవాళ కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.కాంగ్రెస్ పార్టీ నుంచి జనగాం నియోజకవర్గ టికెట్ ఆశించిన భంగపడ్డ పొన్నాల లక్ష్మయ్య ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube