హైదరాబాద్ నగరంలో ఫేక్ ఫింగర్ ప్రింట్స్ తో మోసాలకు పాల్పడుతున్న నిందితులను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు.ఫేక్ ఫింగర్ ప్రింట్స్ ను ఉపయోగించి ఆన్ లైన్ లో పెద్ద మొత్తంలో అమౌంట్ ను కేటుగాళ్లు విత్ డ్రా చేస్తున్నట్లు గుర్తించారు.
ఈ క్రమంలో రంగంలోకి దిగిన సీఐడీ పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఉన్న సేల్ డీడ్ ల ద్వారా ఫింగర్ ప్రింట్స్ ను నిందితులు దోచేస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు.
ఫింగర్ ప్రింట్స్ తో పాటు ఆధార్ నంబర్లను కాజేస్తున్న కేటుగాళ్లు సిలికాన్ ఫింగర్స్ ప్రింట్స్ ను తయారు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు.ఆధార్ ద్వారా నగదు విత్ డ్రా చేసే విధానాన్ని ఆసరాగా చేసుకున్న నిందితులు కస్టమర్లకు తెలియకుండానే నగదును దోచేస్తున్నారని పోలీసులు వెల్లడించారు.