జేడీఎస్ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి బీజేపీతో పొత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈ మేరకు సీట్ల పంపకంపై ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు అవుతుందని పేర్కొన్నారు.
అయితే తమ లక్ష్యం కాంగ్రెస్ ఓటమేనని మరోసారి స్పష్టం చేశారు.అయితే బీజేపీ, జేడీఎస్ పార్టీల మధ్య పొత్తు కుదిరిందని బీజేపీ నేత యడియూరప్ప ఇటీవలే వెల్లడించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే జేడీఎస్ కు మూడు నుంచి నాలుగు ఎంపీ సీట్లు ఇచ్చేందుకు బీజేపీ అధిష్టానం అంగీకరించిందని తెలిపారు.







