వైసీపీ ఎంపీ మార్గాని భరత్( Bharat Margani ) కీలక వ్యాఖ్యలు చేశారు.టీడీపీ అధినేత చంద్రబాబు కోసమే జనసేనాని పవన్ కల్యాణ్ పార్టీ పెట్టారని పేర్కొన్నారు.
పవన్ నిర్ణయాలతో జనసేన నేతలు అంతా రోడ్డునపడ్డారని విమర్శించారు.
పవన్ కల్యాణ్ ( Pawan Kalyan )సీఎం అభ్యర్థిగా పోటీ చేస్తారని కార్యకర్తలు ఎదురు చూశారన్న ఆయన ప్రజలు జనసేన – టీడీపీకి( Janasena ,TDP ) ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు.కందుల దుర్గేశ్ వంటి నేతలను జనసేన పక్కన పెట్టిందన్నారు.ఈ క్రమంలోనే దుర్గేశ్ లాంటి వ్యక్తులను పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని తెలిపారు.