దీపావళికి ఫ్లిప్ కార్ట్ మరో సేల్ ప్రారంభం!

పండగ సీజన్లను పురస్కరించుకుని చిన్న షాపుల నుంచి పెద్ద మాల్స్ వరకు భారీ డిస్కౌంట్ లను, ఆఫర్లను ప్రకటిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తుంటుంది.

అయితే కరోనా నేపథ్యంలో లో షాపింగ్ మాల్స్ కన్నా, ఈ కామర్స్ ద్వారా కస్టమర్లు తమకు కావాల్సిన వస్తువులను ఇంటి నుంచి షాపింగ్ చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.

ఈ నేపథ్యంలోనే ఈ కామర్స్ సంస్థలన్నీ కూడా ప్రత్యేకమైన ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటుంది.దసరా పండుగను పురస్కరించుకొని బిగ్ బిలియన్ డేస్ పేరుతో సేల్స్ ను నిర్వహించిన ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ఇప్పుడు తాజాగా మరో సెల్ కు సిద్ధమైంది.

దీపావళి పండుగను పురస్కరించుకొని"బిగ్ దివాలి సేల్" పేరిట సేల్స్ ప్రారంభించింది.అయితే ఈ అక్టోబర్ 29 నుంచి నవంబర్ 4వ తేదీ వరకు ఈ సెల్ నడుస్తుందని ఈ సంస్థ పేర్కొంది.

ఫ్లిప్ కార్ట్ ప్లస్ మెంబర్స్ కు ఈ సేల్ లో ముందుగా పాల్గొనే అవకాశం వారికి కల్పించింది.మొత్తం ఏడు రోజుల పాటు నడిచే ఈ సెల్ లో భాగంగా ప్రముఖ యాక్సిస్ బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డు కలిగిన వినియోగదారులకు 10 శాతం వరకు డిస్కౌంట్ లభించనుంది.

Advertisement

అంతేకాకుండా ఇతర బ్యాంకు కార్డులపై నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని ఈ సేల్ కల్పించింది.బిగ్ బిలియన్ డేస్ సేల్ మాదిరిగానే బిగ్ దివాలి సేల్ లో కూడా మొబైల్స్ పై ప్రత్యేక డిస్కౌంట్లను కల్పించింది.

సాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 41, గెలాక్సీ ఎస్ 20 +, గెలాక్సీ ఏ50 ఎస్ తో పాటు ఎం 2, ఎం 2 ప్రో,ఒప్పో రెనో 2ఎఫ్‌, ఏ52, ఎఫ్‌15, రియల్‌మీ నార్జో 20 సిరీస్‌ మొదలైన ఫోన్లపై బిగ్ దివాలి సెల్ లో ప్రత్యేక డిస్కౌంట్లను కస్టమర్లకు కల్పించనుంది.అంతే కాకుండా కేవలం ఒక్క రూపాయికే మొబైల్ ప్రొటెక్షన్ ను ఈ బిగ్ దివాలి సేల్ కస్టమర్లకు అందించనుంది.

కేవలం ఫోన్లపై మాత్రమే కాకుండా ఎలక్ట్రానిక్ వస్తువులు అయినా లాప్టాప్, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్, మైక్రోఓవెన్ లో మొదలైన వాటిపై కూడా ప్రత్యేకమైన డిస్కౌంట్లను ఈ సేల్స్ ద్వారా అందించనుంది.

కార్మికులను బెల్టుతో ఇష్టానుసారం కొట్టిన చైనా వ్యక్తి.. వైరల్ వీడియో...?
Advertisement

తాజా వార్తలు