తెలంగాణ రాష్ట్రం ఉలిక్కిపడేలా జరిగిన హైకోర్టు న్యాయవాద దంపతులు వామనరావు, నాగమణి హత్యల విషయంలో ఎన్నో సంచలన విషయాలు దాగున్నాయట.ఇప్పటికే తెలంగాణ బీజేపీ నేతలు ఈ విషయంలో సంచలనమైన వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ హాత్యకు కారణం తెలంగాణ ప్రభుత్వం అని విమర్శలు కూడా చేస్తున్నారు.ఇకపోతే నిన్న పెద్దపల్లి జిల్లా కవలచర్ల వద్ద ఈ హత్య జరిగిన విషయం తెలిసిందే.
కాగా వామనరావు తండ్రి గట్టు కిషన్ రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసులో నిందితులుగా ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

అందులో ఏ1గా వసంతరావు, ఏ2గా కుంట శ్రీను, ఏ3గా కుమార్ లపై కుట్ర, హత్య అభియోగాలు మోపారు.వారిపై ఐపీసీ 120బి, 302, 341, 34 కింద కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు.అయితే ఈ హత్యకు ఈ స్థల వివాదమే కారణం కావొచ్చన్న విభిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
అంతేకాదు కొందరు అధికారపార్టీ నేతల హస్తం కూడా ఉందని ప్రచారం జరుగుతుంది.మరి నిజానిజాలూ పోలీసులు వెలికితీస్తే గానీ ఈ హత్యలో ఎవరెవరి హస్తం ఉందో తెలియదు.
అంతవరకు వేచి చూడవలసిందే.