సినీ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలకు ఉండే అభిమానుల అభిమానం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తమ అభిమాన హీరోలకు చూపించే అభిమానం మరెవ్వరికీ చూపించరు అని చెప్పాలి.
ముఖ్యంగా తమ అభిమాన హీరోలను వేరే అభిమాన హీరోలు ఏమైనా అంటే మాత్రం అస్సలు ఊరుకోరు.ప్రతి చిన్నదానికి పెద్ద గొడవతో బాగా రచ్చరచ్చ చేస్తారు.
నిజానికి హీరోలు-హీరోలు బాగానే ఉంటారు కానీ హీరోల అభిమానులే ప్రతి చిన్న దానికి పెద్ద గొడవ చేసి దానిని బాగా ట్రెండ్ చేస్తారు.చివరికి అది హీరోల దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్లు వాటిని లైట్ తీసుకుంటూ ఉంటారు.
అంతేకానీ హీరోల మధ్య మాత్రం విభేదాలు రావు.అలా ఇప్పటికీ ఎంతో మంది హీరోల అభిమానుల మధ్య విభేదాలు వచ్చాయి.
కానీ హీరోలు మాత్రం వాటిని లైట్ తీసుకుంటూనే ఉన్నారు.
ఇప్పటికే అల్లు అర్జున్, మహేష్ బాబు, ప్రభాస్ వంటి పలువురు స్టార్ హీరోల అభిమానులు చాలాసార్లు ఏదో ఒక వివాదాన్ని సృష్టించారు.
ఇటీవలే మరో ఇద్దరు స్టార్ హీరోల అభిమానులు కూడా పెద్ద గొడవ చేశారు.మామూలుగా అభిమానులు తమ అభిమాన హీరో కోసం సినిమా విషయాల్లో గొడవ పడతారని తెలుసు.
కానీ కొందరు అభిమానులు మాత్రం రాజకీయ పరంగా కూడా గొడవ పడతారు.గతంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి విషయంలో కూడా ఆయన అభిమానులు రాజకీయ పరంగా బాగా వివాదం సృష్టించారు.
అంతేకాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎన్టీఆర్ అభిమానులు కూడా ఆయనను రాజకీయ పరంగా మధ్యలోకి లాగుతూ సంచలనం సృష్టించారు.దాంతో ఎన్టీఆర్ అప్పుడే ఆ విషయం గురించి స్పందించి గొడవను సద్దుమణిగేలా చేశాడు.
అయినా కూడా అభిమానుల తీరు మాత్రం మారలేదు.మళ్లీ ఎన్టీఆర్ ను రాజకీయాల్లోకి లాగడమే కాకుండా పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా పెద్ద వివాదం సృష్టించారు.గతంలో పెనుమంట్ర మండలం పొలమూరు గ్రామంలో మహంకాళి అమ్మవారి జాతర వేడుకలు ఘనంగా జరిగాయి.ఆ సమయంలో అక్కడున్న ఈ స్టార్ హీరోల అభిమానులు.తమ అభిమాన హీరోలు అయిన ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ ఫోటోలతో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.అంతేకాకుండా ఆ ఫ్లెక్సీ లకు పాలాభిషేకం కూడా చేశారు అభిమానులు.
దీంతో సీఎం పవన్ కళ్యాణ్, సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఇద్దరి అభిమానుల మధ్య జోరుగా నినాదాలు జరిగాయి.
ఇక తాజాగా మరోసారి ఎన్టీఆర్ సీఎం అంటూ మరోచోట ప్రచారం చేశారు.ఇంతకు అసలు సంగతేంటంటే.ఇటీవల అనంతపురంలో రామ్ పోతినేని నటించిన ది వారియర్ మూవీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరిగింది.
ఇక ఆ వేడుకకు పలువురు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు కూడా పాల్గొన్నారు.ఇక అందులో కొందరు ఎన్టీఆర్ అభిమానులు ఉండగా వాళ్లంతా.సీఎం ఎన్టీఆర్.ఆర్ఆర్ఆర్ అని రాసి ఉన్న ఫ్లకార్డులను పట్టుకొని ఉన్నారు.
అంతేకాకుండా సీఎం ఎన్టీఆర్ అంటూ బాగా అరుస్తూ రచ్చ రచ్చ చేశారు. ఇక దీనికి సంబంధించిన ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇక మరోసారి ఎన్టీఆర్ ఈ విషయం గురించి ఎలా స్పందిస్తాడో చూడాలి.మొత్తానికి ఎన్టీఆర్ సీఎం కావాలి అని తెలుగు రాష్ట్రాల ప్రజలు బాగా పోరాడుతున్నారు.