టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రభాస్( Prabhas ) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
అన్ని కూడా పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం.ఈ విషయంలో అభిమానులు సంతోషపడుతున్నప్పటికీ ప్రభాస్ సినిమాల విషయంలో మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నప్పటికీ ఇప్పటివరకు సినిమాకు సంబంధించిన ఒక్క అప్డేట్ ని కూడా విడుదల చేయకపోవడం పట్ల అభిమానులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు.ఇకపోతే ప్రభాస్ నటిస్తున్న తాజా సినిమా ఆదిపురుష్.
అయితే ఇప్పటికి ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా గత ఏడాది టీజర్ విడుదల కావడంతో భారీగా ట్రోల్స్ విమర్శలు వినిపించాయి.ఈ సినిమాను ఎడిట్ చేసే పనిలో పడ్డారు చిత్ర బృందం.ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి దాదాపు ఏడాది అవుతున్న కూడా ఈ సినిమాకు సంబందించి ఒక చిన్న అప్ డేట్ కూడా ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ బాగా నిరాశకు గురవుతున్నారు.ప్రభాస్ తన కొత్త సినిమాలకి సంబంధించి చిన్న అప్ డేట్ ఇచ్చే విషయంలో బాగా వెనుకపడుతున్నాడు.
వరుసపెట్టి సినిమాలు చేస్తున్నప్పటికి ఏ సినిమా విషయంలో టీజర్ రిలీజ్ చేయకపోవడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మరి ముఖ్యంగా ఆదిపురుష్( Adipurush ) డైరెక్టర్ ఓం రౌత్ పై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గత ఏడాది సంక్రాంతికి విడుదల చేసిన ఆదిపురుష్ టీజర్ విమర్శల పాలవ్వడంతో ఈ సినిమాను ఎడిట్ చేసే పనిలో పడ్డారు.ఇక గత ఏడాది దర్శకుడు ఓం రౌత్ పై భారీగా ట్రోల్స్ వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే.కాగా ఇప్పటికే ఆదిపురుష్ రిలీజ్ డేట్ 2023 జూన్ 16 అని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.ఇదే విడుదల తేదీకి కేవలం రెండు నెలల సమయం మాత్రమే ఉంది.
ఇంతవరకు ఈ సినిమాకు సంబంధించిన ఎటువంటి అప్డేట్ కూడా లేకపోవడంతో అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ అవుతుందా?లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.తాజాగా ఉగాది పండుగకు ఈ సినిమాకు సంబంధించిన ఏదైనా అప్డేట్ వస్తుందేమో అని ప్రభాస్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూడగా అసలు ఏ అప్డేట్ ఇవ్వకపోవడంతో ఫాన్స్ నిరాశ చెందుతున్నారు.
దాంతో డార్లింగ్ ఫాన్స్ ప్రస్తుతం డైరెక్టర్ ఓం రౌత్( Om Raut ) విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు.మరి ఇప్పటికైనా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ నీ విడుదల చేస్తారో లేదో చూడాలి మరి.