తెలంగాణలో తన కార్యకలపాలను విస్తరించబోతున్నట్లు అంతర్జాతీయ దిగ్గజ సంస్థ పెప్సికో సంస్థ ప్రకటించింది.దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో మంత్రి కేటీఆర్ తో సంస్థ ప్రతినిధులు సమావేశం అయ్యారు.
ఈ క్రమంలో హైదరాబాద్ కేంద్రంగా గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ సెంటర్ ను మరింతగా విస్తరించనున్నట్లు పెప్సెకో సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.కాగా గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ సెంటర్ లో ప్రస్తుతం 2,800 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తుండగా… ఉద్యోగుల సంఖ్యను నాలుగు వేలకు పెంచబోతున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.
ఏడాది వ్యవధిలోనే అదనపు ఉద్యోగులను నియమించనున్నట్లు ప్రకటించింది.