ఎవరి ఇంటి పరిసరాలను వారే శుభ్రం చేసుకోవాలి ఫ్రైడే డ్రై డే లో పాల్గొని పలు ఇళ్ళల్లోకి వెళ్ళి అవగాహన కల్పించిన కలెక్టర్.సీజనల్ వ్యాధులు డెంగీ, మలేరియా, అతిసారం వంటి వ్యాధులు వ్యాపించకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.
పీ గౌతం గారు అన్నారు.ఫ్రైడే- డ్రైడే కార్యక్రమంలో భాగంగా ఖమ్మం కార్పోరేషన్ 3వ డివిజన్ జయ నగర్ కాలనీ లో జిల్లా కలెక్టర్ VP గౌతమ్ గారు, మేయర్ పునుకొల్లు నీరజ గారు, నిర్వహించారు.
ఫ్రైడే- డ్రైడే కార్యక్రమంలో భాగంగా ఖమ్మం కార్పోరేషన్ 3వ డివిజన్ జయ నగర్ కాలనీ, sc కాలనీ ల నందు ఇటీవల కాలంలో డెంగ్యూ జ్వరం బారిన పడిన వారి ఇళ్ళలోకి వెళ్ళి అవగాహన కల్పించారు.చుట్టుప్రక్కల పరిసరాలను పరిశీలించి పలు అవగాహన ,సూచనలు చేశారు.
ఇళ్ళ మధ్య గల పాత ఇల్లులు,ఖాళీ స్థలాల్లో మురుగు నీరు, వర్షం నీరు చేరడంతో ఆయా స్థల యజమానులకు సమాచారం ఇచ్చి ఆయా స్థలం బాగు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు సూచనలు చేశారు.ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే ను తూచా తప్పకుండా పాటించాలని, విష జ్వరాలు ప్రబలకుండా చర్యలు చేపట్టాలన్నారు.
ఇళ్లల్లో ఎవరికైనా జ్వరం వస్తే తేలికగా తీసుకోవొద్దు మన దగ్గర్లో ఉన్న బస్తీ దవాఖాన లో వైద్యులను సంప్రదించి, నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కోరారు.డెంగీ, మలేరియా లక్షణాలు ఉంటే వారికి సమీపంలోని పెద్ద ఆసుపత్రిలో అవసరమైన చికిత్సలు చేయించాలని,విష జ్వరాలు ఈ సీజన్లలో అత్యంత వేగంగా ప్రబలే ప్రమాదం ఉందని, వైద్య అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు డివిజన్ ప్రాంతాల్లో మంచినీటి పైపులైన్లు లీకేజీ ఉండి నీరు వృధాగా పోతున్న ఎడల వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేసి నివారించాలని కోరారు సీజనల్ వ్యాధులు రాకుండా అంగన్వాడి, ఆశ, ఆరోగ్య కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ VP గౌతమ్ గారు మేయర్ పునుకొల్లు నీరజ గారు,మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి గారు స్థానిక కార్పొరేటర్ మళ్లీ జగన్, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ మల్లేశ్వరి గారు, DM &HO మాలతీ గారు, DMO సంధ్య ,Dr.ఉషారాణి, Dr.స్రవంతి,ANM లు రోహిణి.రాధ తదితరులు ఉన్నారు.