టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా గుర్తింపు పొందిన నవదీప్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.చందమామ, గౌతమ్ ఎస్ఎస్సి వంటి సినిమాలలో హీరోగా నటించిన ప్రేక్షకులను ఆకట్టుకున్న నవదీప్ ఆ తరువాత హీరోగా సరైన అవకాశాలు రాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆర్య, అలా వైకుంఠపురం వంటి సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కీలక పాత్రలలో నటించాడు.
ఇలా ప్రస్తుతం అడపాదడపా సినిమాలలో నటిస్తూ ఉండే నవదీప్ తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా నిశ్చితార్థం చేసుకున్నాడు.ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ గా ఉన్న హీరోలందరూ వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు.
తాజాగా నవదీప్ షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఒక అమ్మాయి చేతులకు గోరింటాకు పెట్టుకొని ఎడమ చేతిలో మెరిసిపోతున్న ఉంగరం పెట్టుకొని, కుడిచేతితో ముఖం కనిపించకుండా దాచుకున్నట్లు ఉన్న ఫోటోని ఇన్ స్టా స్టోరీస్ లో పోస్ట్ చేస్తూ వాలంటైన్స్ డే స్పెషల్ అంటూ ఖుషి అహుజా అన్న అకౌంట్ ని టాగ్ చేశాడు.ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.దీంతో ఆ అమ్మయి వివరాలు తెలుసుకునే పనిలోనే నెటిజన్లు నిమగ్నమయ్యారు.ఈ ప్రయత్నంలోనే నవదీప్ అందరిని ప్రాంక్ చేసినట్లు గుర్తించారు.
ఆ అమ్మాయి వివరాలు గురించి తెలుసుకోవటానికి ఆ అకౌంట్ ఓపెన్ చేయగానే ‘ చూసింది చాలు ఇక కూర్చో’ అని అర్థం వచ్చేలా అక్కడ రాసుంది.దీంతో వాలెంటెన్స్ డే రోజున నవదీప్ అందరిని ఫ్రాంక్ చేశాడని నెటిజన్స్ ఒక నిర్ణయానికి వచ్చారు.దీంతో కొంతమంది నెటిజన్లు మోసం చేసావేంటి? అని కామెంట్స్ చేస్తున్నారు.ఇక ఈ విషయం గురించి నవదీప్ మోసం చేశాడంటూ ఒక నెటిజన్ ఏకంగా వీడియో షేర్ చేశాడు.అయితే నవదీప్ ఆ వీడియోని ఇన్ స్టా స్టోరీస్ లో తిరిగి షేర్ చేశాడు.
మొత్తానికి తన పోస్ట్ తో నవదీప్ అందరినీ ఫూల్స్ చేశాడు.ఈ విషయం అటుంచితే టాలివుడ్ ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో నవదీప్ కూడా ఒకరు.
ఈయనతో సమానంగా ఉన్న హీరోలు అందరూ పెళ్లిళ్లు చేసుకున్నారు మరి ఈయన పెళ్లి ఎప్పుడు చేసుకుంటారా అని అందరూ ఎదురు చూస్తున్నారు.