మహారాష్ట్ర( Maharashtra )లో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది.గడ్చిరోలి జిల్లా( Gadchiroli )లోని కోలమర్క అడవుల్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్ట్ అగ్రనేతలు మృతిచెందారు.అయితే మృతిచెందిన నలుగురు మావోలు తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.
డివీసీ సభ్యులు వర్గీస్, మంగాతు, ప్లాటూన్ సభ్యులు కురసం రాజు, వెంకటేశ్ గా మృతులను గుర్తించారు.కాగా ఈ నలుగురు మావోయిస్టులపై రూ.36 లక్షల రివార్డు ఉంది.అనంతరం ఘటనాస్థలం నుంచి ఒక ఏకే 47, ఒక కార్బైన్, రెండు పిస్టల్స్ తో సహా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.