మాజీ మంత్రి ఈటల రాజేందర్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.టిఆర్ఎస్ పార్టీ హైకమాండ్ ఈటెల రాజేందర్ భూకబ్జాలకు పాల్పడినట్లు ఆరోపణలు చేసి ఆయనపై ఒకేసారిగా రాజకీయమైన దాడిచేయడంతో ఉక్కిరిబిక్కిరి అయిన ఈటల రాజేందర్.తొలుత పార్టీకి రాజీనామా చేయటం తెలిసిందే.ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజుల నుండి అన్ని పార్టీల నాయకులతో సమావేశం అయ్యారు.
ఢిల్లీలో బీజేపీ పార్టీ పెద్దలతో సమావేశమయి ఇటీవల సొంత నియోజకవర్గానికి వచ్చిన సమయంలో భారీ ఎత్తున నియోజకవర్గ ప్రజలు ఈటల రాజేందర్ ని ఆహ్వానించడం జరిగింది.ఇటువంటి తరుణంలో తాజాగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు ఈటల.శామీర్పేటలో ఇంటి వద్ద అనుచరులతో కలిసి.గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు.
ఆ తర్వాత శాసనసభాపతి కార్యాలయంలో స్పీకర్ ఫార్మాట్ రూపంలో రాజీనామా పత్రాన్ని అందించారు.
ఈ క్రమంలో త్వరలోనే బిజెపి పార్టీలో జాయిన్ అవటానికి ఈటల అంతా ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
.