గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పోలీసులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కలిశారు.రాత్రి 3 గంటల పాటు స్థానికుల పోలీసుల నుంచి సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది.
గతంలో మంగళగిరి పోలీస్ స్టేషన్ లో ఎన్ఆర్ఐ సభ్యులపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.ఆ సమయంలోనే కొన్ని కీలక డాక్యుమెంట్స్ ను రూరల్ పోలీసులు సీజ్ చేశారు.
ఈ నేపథ్యంలో రూరల్ పోలీసులను సంప్రదించిన ఈడీ అధికారులు సీజ్ చేసిన పత్రాల కోసం ప్రయత్నిస్తున్నారు.